![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/meetingg-no-fightingff.jpg?fit=729%2C307&ssl=1)
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిషత్లో శనివారం నిర్వహించిన సర్వసభ్యసమావేశంలో తీవ్ర దుమారం చెలరేగింది. వాగ్వాదాలు, సవాళ్లు, చాలెంజ్ విసురుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరిమీదకు ఒకరూ కొట్టుకొనే స్థాయికి వెళ్లారు. సమావేశమంతా రసాబాసగా మారింది. ‘లక్షలు రూపాయలు అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తుంటే.. మిషన్ భగీరథ ఏఈ రాఘవేంద్రరావు బిల్లులు చేయకుండా వేధిస్తున్నారని.. ఆయన లంచాలకు మరిగారని బిజినేపల్లి సర్పంచ్ బాల్ ఈశ్వర్ ధ్వజమెత్తారు. దీనిపై ఏఈ రాఘవేంద్రరావు కూడా తీవ్రంగా స్పందించారు. వీళ్లిద్దరూ ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు. ఓ దశలో సమావేశం గందరగోళంగా మారింది. అనంతరం సల్కరిపేట ఎంపీటీసీ ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామాలలో ఎస్సీ ఎస్టీ భూములను అధికార పార్టీ నాయకులు లాక్కొని రైతు వేదిక , స్మశాన వాటికలు కడుతున్నారని ఆరోపించారు. ఎంపీడీవో హరినాథ్ గౌడ్ సభ్యులను శాంతపరిచారు. సమావేశంలో ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, తహసీల్దార్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.