Breaking News

మాస్క్​ ఉంటేనే బయటికిరండి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అని వాహనదారుల వద్ద మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ మంగళవారం ఆరాతీశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యూ టౌన్ చౌరస్తా వద్ద ఆయన లాక్​ డౌన్ ఎత్తివేత, నిబంధనల అమలు తదితర పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా టూ వీలర్స్​, ఆటో, కార్లను, బస్సులను పలు విషయాలు తెలుసుకున్నారు. మాస్క్ లు కట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. మాస్క్ లు లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు.