Breaking News

మార్కెట్​కమిటీ చైర్​పర్సన్​గా సుగుణ

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్​పర్సన్​గా కొండా సుగుణ నియమితులయ్యారు. శుక్రవారం ఆమె దేవరకద్రలోని శ్రీనివాస గార్డెన్​ ఫంక్షన్​హాల్​లో ప్రమాణం చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు వి.శ్రీనివాస్​గౌడ్​, ఎస్​.నిరంజన్​రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.