Breaking News

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డికి ఘననివాళి

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డికి ఘననివాళి

సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్​కర్నూల్ ​జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సంతాపసభను గురువారం స్థానిక సీకేఆర్ ​గార్డెన్స్​లో నిర్వహించారు. నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్​ ఎంపీలు పి.రాములు, మన్నె శ్రీనివాస్​రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్​ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టి.ఆచారి, మాజీమంత్రి చిత్తరంజన్​దాస్​, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, కల్వకుర్తి జడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్, మార్కెట్​కమిటీ చైర్మన్​ బాలయ్య, అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.