Breaking News

మహేష్​బాబుతో కీర్తి జోడి?

మహేష్​బాబుతో కీర్తి జోడి?

మహేష్​​ బాబు, పరుశరామ్ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’ భారీ అంచనాలతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ ఎంపికకు సంబంధించి పలు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో కీర్తి సురేష్ ఫైనల్ అయిందన్న వార్త ప్రస్తుతం వైరల్​ అవుతోంది. కానీ ఈ చిత్ర యూనిట్‌ మాత్రం ఇప్పటికీ అఫీషియల్‌ గా ప్రకటించలేదు. కానీ కీర్తి ఆమధ్య ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో కన్ఫర్మ్ చేసింది.

అయితే కొద్దిరోజులుగా ఆమె ప్లేస్‌ లో మరొకరిని తీసుకున్నారనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో కీర్తి ఈ చిత్రంలో నటిస్తోందా? లేదా? అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అసలు వాస్తవం ఏమిటంటే అమెరికాలో ఈ సినిమా షూటింగ్‌కు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఇలా హీరోయిన్‌ మార్పు ఏమిటి.. అనే అంశం ఆసక్తి కలిగిస్తోంది. కానీ కీర్తి యూఎస్‌ షెడ్యూల్‌ కోసం మహేష్ మూవీ టీమ్‌ వీసా కూడా అప్లై చేశారని తెలుస్తోంది. దీంతో కీర్తి ఈ సినిమాలో నటించడం లేదనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదనిపిస్తోంది. ఇక కీర్తి నటించిన తెలుగు సినిమాలు ‘గుడ్‌లక్‌ సఖి’, ‘మిస్‌ ఇండియా’ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.