Breaking News

మహిళ చేతిలో మోసపోయిన విశాల్​

ప్రముఖ తమిళ హీరో, నిర్మాత, నడిగర్​ సంఘం కీలకసభ్యడు విశాల్​ను ఆయన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళ మోసగించింది. ఆరేండ్ల నుంచి సుమారు 45 లక్షలు కాజేసినట్టు సమాచారం. ఆమె తాజాగా ఓ భారీ ఇల్లు కొనుగోలు చేయడంతో ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఈ మేరకు విశాల్‌ మేనేజర్‌ చెన్నైలోని విరుగంబక్కం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. సదరు మహిళ ఆదాయపన్ను కట్టాల్సిన డబ్బులు తన సొంత అకౌంట్‌కు బదిలీ చేసి ఆరేండ్లలో 45 లక్షలు పోగేసినట్టు సమాచారం. కాగా విశాల్​ ప్రస్తుతం చక్ర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఎంఎస్​ ఆనందన్​ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా 2021లో విడుదల కానుంది. డిటెక్టివ్ సినిమాకు సీక్వెల్ ఇది.