![మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/12/MDK-2-3.jpg?fit=693%2C334&ssl=1)
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని చిన్నశంకరంపేట ఎస్సై మహమ్మద్ గౌస్ ఆకాంక్షించారు. శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ లో మహిళా మండలి అధ్యక్షురాలు గంగ, మహిళలతో కలిసి ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బందిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గంగ మాట్లాడుతూ.. మహిళా సమస్యలు, ఆడపడుచుల మిస్సింగ్ కేసులు, భార్యాభర్తల గొడవలు, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరిస్తున్న పోలీసుల సేవలు బాగున్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో ఏఎస్సై గంగయ్య, హెడ్ కానిస్టేబుల్స్ వీరన్న, వెంకటేశం, కానిస్టేబుల్స్ వినోద్, కిషన్, గౌస్ఉద్దీన్, శ్రీకాంత్, లావణ్య, అనూష పాల్గొన్నారు.