![మహానేతకు పూలాభిషేకం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/knl-2f-1.jpg?fit=677%2C456&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి బుధవారం కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, విజయ మనోహరి దంపతులు తన నివాసంలో పూలాభిషేకం చేశారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలాభిషేకం చేస్తే పాల కొరత వస్తుందని, పూలతో అభిషేకం నిర్వహించడంతో స్థానికులు ఎస్వీ దంపతులను అభినందించారు. వైఎస్సార్ పేదవాడి గుండెచప్పుడు తెలిసిన ప్రజానాయకుడని కొనియాడారు. అనంతరం కర్నూలు ఎస్టీబీసీ కాలేజీలో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతిలో పాల్గొన్నారు. బోయపాటి మధు ఏర్పాటుచేసిన బ్లడ్ క్యాంపును ఎస్వీ మోహన్రెడ్డి దంపతులు ప్రారంభించారు. అనంతరం పలువురు ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు. ఈరన్న, రామకృష్ణ నాయుడు, బోయపాటి నాగ, పరుశురాం, సత్య, కోటేష్ గౌడ్, నీతిష్ వర్మ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/sv-2f.jpg?resize=593%2C270&ssl=1)