Breaking News

మహానేతకు పూలాభిషేకం

మహానేతకు పూలాభిషేకం

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్​ రాజశేఖర్​రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి బుధవారం కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​రెడ్డి, విజయ మనోహరి దంపతులు తన నివాసంలో పూలాభిషేకం చేశారు. వైఎస్సార్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలాభిషేకం చేస్తే పాల కొరత వస్తుందని, పూలతో అభిషేకం నిర్వహించడంతో స్థానికులు ఎస్వీ దంపతులను అభినందించారు. వైఎస్సార్​ పేదవాడి గుండెచప్పుడు తెలిసిన ప్రజానాయకుడని కొనియాడారు. అనంతరం కర్నూలు ఎస్​టీబీసీ కాలేజీలో నిర్వహించిన వైఎస్సార్ ​వర్ధంతిలో పాల్గొన్నారు. బోయపాటి మధు ఏర్పాటుచేసిన బ్లడ్​ క్యాంపును ఎస్వీ మోహన్​రెడ్డి దంపతులు ప్రారంభించారు. అనంతరం పలువురు ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు. ఈరన్న, రామకృష్ణ నాయుడు, బోయపాటి నాగ, పరుశురాం, సత్య, కోటేష్ గౌడ్, నీతిష్ వర్మ, వైఎస్సార్​సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బ్లడ్​ క్యాంపును ప్రారంభిస్తున్న ఎస్​వీ మోహన్​రెడ్డి దంపతులు