Breaking News

మళ్లీ తనే కావాలంట..

మళ్లీ తనే కావాలంట..

‘సీత’సినిమా ప్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు తేజ. ఈ సమయాన్ని రెండు స్క్రిప్ట్ లను రెడీ చేయడంలో వెచ్చించాడు. లాక్ డౌన్ కు ముందే తన రెండు ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసిన తేజ అందులో మొదటిది గోపీచంద్ హీరోగా ‘అలివేలు మంగ వెంకటరమణ’ అనే రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రాన్ని ఆగష్టులో లాంచ్ చేసి సెప్టెంబర్ నుంచి షూటింగ్ ను మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు తేజ. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో తేజకు చుక్కెదురవుతూ వస్తోంది.

ముందుగా కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా అనుకున్నాడు కానీ అప్పుడే ‘సీత’ చిత్రంలో కాజల్ తో పనిచేయడంతో వేరే ఆప్షన్స్ ను కూడా చూసుకున్నాడు. కీర్తి సురేష్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ వంటి వారిని కూడా అప్రోచ్ అయ్యాడు. కానీ ఈ కథకు ఎవరూ సెట్ అవ్వకపోవడం.. డేట్స్ అడ్జెస్ట్ అవ్వక పోవడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ కే తేజ ఓటు వేసినట్లు తెలుస్తోంది. గోపీచంద్ పక్కన కాజల్ అయితే బాగుంటుందని.. ఆ క్యారెక్టర్​కు తానైతేనే కరెక్ట్​గా సూటవుతుందని అనుకుంటున్నాడట తేజ. ఈ చిత్రం కాకుండా రానా హీరోగా ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే ప్రాజెక్ట్ ను కూడా పట్టాలెక్కించనున్నాడు.