Breaking News

పేదల గుండెల్లోనే వైఎస్సార్

సారథి న్యూస్​, కడప: దివంగత ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్‌ వైఎస్ ​రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్​ఘాట్​ వద్ద ఏపీ సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి తల్లి విజయమ్మ, సతీమణి భారతి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ట్విట్టర్​ వేదికగా తన తండ్రి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు అవుతుంది. ఆ మ‌హానేత శ‌రీరానికి మ‌ర‌ణం ఉంటుంది కానీ, ఆయ‌న జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మ‌ర‌ణం ఉండ‌దు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉండి నడిపిస్తున్నారు.’ అని పేర్కొన్నారు.

  • కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్​ ఘాట్​ వద్ద నివాళులర్పిస్తున్న ఏపీ సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు