![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/3-1.jpeg?fit=677%2C358&ssl=1)
సారథి న్యూస్, కడప: దివంగత ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ఘాట్ వద్ద ఏపీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి తల్లి విజయమ్మ, సతీమణి భారతి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ట్విట్టర్ వేదికగా తన తండ్రి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు అవుతుంది. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉండి నడిపిస్తున్నారు.’ అని పేర్కొన్నారు.