![మధ్యప్రదేవ్ సీఎంకు కరోనా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/MADYAPRADESH-CMFF.jpg?fit=930%2C523&ssl=1)
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్(61) చౌహాన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ‘ నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోండి. నేను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడుతూ ఐసోలేషన్లో ఉన్నాను. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.