Breaking News

మధ్యప్రదేశ్​ సీఎంకు కరోనా

మధ్యప్రదేవ్​ సీఎంకు కరోనా

భోపాల్​: మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​(61) చౌహాన్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కాగా ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ‘ నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోండి. నేను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడుతూ ఐసోలేషన్​లో ఉన్నాను. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.