Breaking News

మంత్రులు కేటీఆర్, నిరంజన్​రెడ్డి త్వరగా కోలుకోవాలి

మంత్రులు కేటీఆర్, నిరంజన్​రెడ్డి త్వరగా కోలుకోవాలి
  • మానవపాడులో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

సారథి, మానవపాడు: రాష్ట్ర ఐటీ, మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని, అదే విధంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోగ్యకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని జామియా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరంతరం ప్రజల కోసం పరితపించే యువ నాయకుడు కేటీఆర్​కరోనా సమయంలో కూడా ప్రజల ఆరోగ్యం బాగుండాలని మన మధ్య తిరుగుతున్నారని తెలిపారు. ఆయన క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. త్వరగా కోలుకోవాలని అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. మసీదు ముతవల్లి మహబూబ్ పాషా, మాజీ మండల కోఆప్షన్ డాక్టర్​ అబ్దుల్ అజీం, చోట, ఖలీమ్, అక్బర్, అన్ను, ఇబ్రహీం, మహమ్మద్ ఉసేన్, చాంద్ బాషా తదితరులు దువా చేశారు. ప్రజల ఆశీర్వాదంతో కరోనా నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి కోలుకోని ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని ప్రార్థించారు. కరోనా పీడ మన అందరి నుంచి తొలగిపోవాలని అల్లాను వేడుకున్నారు.

మానవపాడులో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు