![మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/KTR_AGSI-2F.jpg?fit=350%2C232&ssl=1)
సారథి న్యూస్, మహబూబ్ నగర్: జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన వీరన్నపేటలో 660 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. అక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలో మంత్రి కాన్వాయ్ కు ఓ కుటుంబం అడ్డుకుంది. తమ భూమిని కబ్జా చేసి టీఆర్ఎస్ నేతలు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టారని, తమను బెదిరిస్తున్నారని న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే బాధిత కుటుంబం మంత్రిని కలవకుండానే స్థానిక పోలీసులు ఆ కుటుంబాన్ని పక్కకు ఈడ్చిపడేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రిని కలవనిస్తే తమ సమస్యలను చెప్పుకునేవారు కదా.. అని అంటున్నారు.