![రేటు పెంచేసిన కాజల్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/KAJUUUUFF.jpg?fit=700%2C394&ssl=1)
అరగంట నిడివి ఉన్న ఓ పాత్రలో నటించేందుకు హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ రూ. 70 లక్షలు తీసుకున్నట్టు సమచారం. రానా హిందిలో నటిస్తున్న ‘ హాథీ మేరీ సాథీ’ అనే చిత్రంలో కాజల్ ఓ ఆదివాసి మహిళ పాత్రను చేస్తున్నది. ఈ సినిమాలో అరగంట సేపే కాజల్ పాత్ర ఉంటుందట. అతిథి పాత్రే అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో కాజల్ ఏమాత్రం తగ్గలేదట. ఆ పాత్ర చేసినందుకు రూ.70 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. అయితే ఈ పాత్రలో గ్లామర్డోస్ కూడా ఎక్కువగా ఉండటంతో రేటు పెంచినట్టు సమాచారం. ఈ సినిమా హిందీతో పాటు పలు ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతోంది. తెలుగులో అరణ్య
పేరుతో రిలీజ్ కానున్నది. కాజల్ తెరంగేట్రం చేసి పదిహేనేళ్లు దాటినప్పటికీ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగానే ఉంది.