Breaking News

భక్తిశ్రద్ధలతో దుర్గామాత ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో దుర్గమాత ఉత్సవాలు

సారథి న్యూస్​, నిజాంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ ఆలయంలో ఆదివారం దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీనవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పురోహితులు వేలేటి లక్ష్మణశాస్త్రి మాట్లాడుతూ..కరోనా నేపథ్యంలో దుర్గామాత కమిటీ సభ్యులంతా భౌతికదూరం పాటిస్తూనే మాస్కులు కట్టుకుని అమ్మవారి సేవకు అంకితమయ్యారని తెలిపారు. గ్రామస్తుంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.