Breaking News

బీహార్​లో లాక్​డౌన్​!

షార్ట్ న్యూస్

పాట్నా: బీహార్​లో మరోసారి లాక్​డౌన్​ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశం కానున్నది. దీనిపై ఆ రాష్ట్ర సీఎస్​ దీపక్ ‌కుమార్ మాట్లాడుతూ.. ‘సీఎం నితీష్ కుమార్‌ అధ్యక్షతన ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల క‌ట్టడి గురించి సమీక్షించ‌నున్నారు. పెరుగతున్న కేసుల దృష్ట్యా రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే ఆలోచన ఉంది’ అని ఆయన తెలిపారు. అయితే ఇప్పటికే బెంగళూరు, పూణే నగరాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించగా.. యూపీలో వారాంతాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెల్సిందే. కాగా బిహార్​ రాష్ట్రంలో కొత్త‌గా 1,116 కరోనా కేసులు నమోదుకావడంతో‌ మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 17,421కు చేరుకున్నాయి.