Breaking News

బిల్​గేట్స్​ సంచలన వ్యాఖ్యలు

కరోనా కట్టడిలో అమెరికా విఫలం

వాషింగ్టన్​: అమెరికా ప్రభుత్వంపై మైక్రోసాఫ్ట్​ అధినేత బిల్​గేట్స్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘అమెరికాలో టెస్టులు చేసిన 24 గంటలకు ఫలితాలు వస్తున్నాయి. ఇది ఒక పనికిమాలిన విధానం​. దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. టెస్టులు చేయించుకున్న కరోనా అనుమానితులు ఇష్టమున్నట్టు ప్రజల్లో తిరిగి కరోనాను వ్యాపింపచేస్తారు. దీంతో కరోనా మరింత పెరుగుతుంది. టెస్టులు చేసిన కొన్ని నిమిషాల్లోనే ఫలితాలు రావాలి. కరోనా పేషేంట్లందరనీ క్వారంటైన్​ చేయాలి అప్పడే వ్యాధిని అరికట్టవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. మనదేశంలో కరోనా పరీక్షలు చేసిన రెండు రోజులకో, మూడు రోజులకో ఫలితాలు వస్తున్నాయి. దీంతో బిల్ గేట్స్​కు ఇండియా పరిస్థితి తెలిస్తే ఆయన ఎలా స్పందిస్తారో అని సోషల్​ మీడియాలో కొందరు అంటున్నారు.