Breaking News

బాలీవుడ్ బొమ్మ.. కంగనా రనౌత్

బాలీవుడ్ బొమ్మ.. కంగనా రనౌత్

సినిమాల్లో ఎంత ఇన్టెన్సిటీ ఉన్న క్యారెక్టర్లు చేస్తుందో.. సోషల్ మీడియాలో అంతే వివాదాలు సృష్టిస్తుంది కంగనా రనౌత్. ప్రస్తుతం కోలీవుడ్​లో ఏఎల్​విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. గతేడాది కంగనా నటించిన ‘మణికర్ణిక’ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ సినిమా డబ్బింగ్ తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజై మంచి గుర్తింపు సాధించింది. కంగనా రాణి ఝాన్సీగా అందరినీ మెప్పించింది. దాంతో అచ్చు కంగనా రూపంతో బొమ్మలు తయారు చేశారు ఓ కంపెనీవారు. అదీ రాణి ఝాన్సీ మేకప్​తో కంగనా రూపంతో బొమ్మలు ఉన్నాయి. వాటి గురించి చెబుతూ.. ‘పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టపడతారు.. చిన్నప్పటి నుంచి వాటిని చూసే పెరుగుతుంటారు. అంతేకాదు దేశభక్తి గురించి.. వీరుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం వారికి ఎంతైనా ఉంటుంది..అలాంటి వారికోసం ఈ బొమ్మలు..’ అంటూ తన బొమ్మలు గురించి చెప్పింది కంగనా. అయితే ఈ బొమ్మల ప్రదర్శన గతంలో కరీనా కపూర్ ముద్దుల కొడుకు తైమూర్ ఖాన్ బొమ్మలతో ప్రారంభమైంది. తర్వాత దీపికా పదుకునే నటించిన ‘పద్మావతి’ సినిమాలోనే దీపికా రూపంతో పద్మావతి గెటప్​తో బొమ్మలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా కంగనా బొమ్మలు అలరిస్తున్నాయి.