Breaking News

బస్సులు రైట్..​ రైట్​!

బస్సులు రైట్..​ రైట్​!
  • 19 నుంచి ఆర్టీసీ బస్సులను నడిపించే యోచనలో ప్రభుత్వం
  • నేడు మంత్రి మండలిలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం


సారథి న్యూస్​, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. మంగళవారం నుంచి ప్రజారవాణా సేవలు ప్రారంభంకానున్నాయి. కేంద్ర తాజా మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నడిపించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడంతో పాటు లాక్‌ డౌన్‌ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధివిధానాలపైనా చర్చించే అవకాశం ఉంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌ డౌన్‌ చేపట్టిన ప్రభుత్వం మార్చి నాలుగోవారం నుంచి బస్సులను నిలిపి వేసింది.

తాజాగా కేంద్రం వెసులుబాటు కల్పించడంతో ఈనెల 19(మంగళవారం) నుంచి బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్టీసీ వర్గాలకు దీనిపై ఆదివారం రాత్రి సమాచారమిచ్చింది. సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అధ్యక్షతన ఆర్టీసీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో బస్సుల నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసి సాయంత్రం జరిగే మంత్రిమండలి సమావేశంలో నివేదిస్తారని తెలిసింది. దీనిపై మంత్రిమండలి సమగ్రంగా చర్చించి, బస్సులు నడిపేందుకు అనుమతించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కేంద్రం అనుమతిచ్చినా..!
వాస్తవానికి ఇప్పటికే 50 శాతం బస్సులను తిప్పేందుకు కేంద్ర అనుమతులున్నా కరోనా వ్యాపిస్తుందనే అనుమానంతో ప్రభుత్వం నడపలేదు. తాజాగా రాష్ట్రంలో ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల సంఖ్య పెరగడంతో బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్టీసీ వర్గాలకు దీనిపై ఆదివారం రాత్రి సమాచారమిచ్చింది. సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అధ్యక్షతన ఆర్టీసీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో బస్సుల నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసి సాయంత్రం జరిగే మంత్రిమండలి సమావేశంలో నివేదిస్తారని తెలిసింది. దీనిపై మంత్రిమండలి సమగ్రంగా చర్చించి, బస్సులు నడిపేందుకు అనుమతించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇతర రాష్ట్రాలకు లేనట్లే
తాజాగా రాష్ట్రంలో ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల సంఖ్య పెరగడంతో బస్సులు నడపాలనే భావిస్తోంది. కంటైన్​మెంట్​ జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధానికి నడిచే బస్సు సేవలు, వాటిల్లో పరిమితంగా ప్రయాణికులకు అనుమతించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, సమన్వయం ఇతర అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే వీలుంది.