Breaking News

బస్తీ దవాఖాన ప్రారంభం

బస్తీ దవాఖాన ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్: ఓల్డ్​సిటీ పరిధిలోని సంతోష్​నగర్​లో బస్తీదవాఖానను మంత్రులు కె.తారక రామారావు, తలసాని శ్రీనివాస్​యాదవ్, డిప్యూటీ సీఎం మహమూద్​అలీ శుక్రవారం ప్రారంభించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వారు అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. యాకుత్​పురా ఎమ్మెల్యే సయ్యద్ హైమద్ పాషాఖాద్రి, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.