Breaking News

బయోకాన్​ చీఫ్​ కిరణ్​ మజుందార్​ షాకు కరోనా

బయోకాన్​ చీఫ్​ కిరణ్​ మజుందార్​ షాకు కరోనా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలను సైతం వెంటాడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీ బయోకాన్​ చీఫ్​ కిరణ్​ మజుందార్​(67) షాకు కరోనా ప్రబలింది. తనకు కరోనా సోకిందని ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు కిరణ్​ మజుందార్​ షా స్వయంగా ఓ ట్వీట్​ చేశారు. తాను త్వరలోనే కోలుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కేసుల లెక్కల్లోకి తాను కూడా చేరానని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రముఖ మహిళల్లో కిరణ్​ మజుందార్​ షా ఒకరు. ఇటీవల రష్యా తయారుచేసిన వ్యాక్సిన్​పై ఆమె పలు ప్రశ్నలు సంధించారు. క్లినికల్ ట్రయల్స్​కు సంబంధించిన వివరాలను రష్యా ఎందుకు వెల్లడించడం లేదని ఆమె ప్రశ్నించారు. కాగా కిరణ్​ తొందరగా కోలుకోవాలని డబ్ల్యూహెచ్​వో చీఫ్​ సైంటిస్ట్​ స్వామినాథన్​, కాంగ్రెస్​ నేత శశి థరూర్​ తదితరులు ట్వీట్లు చేశారు.