Breaking News

బన్నీ పొలిటికల్​ ఎంట్రీ

బన్నీ పొలిటికల్​ ఎంట్రీ

ఈ ఏడాది ‘అల వైకుంఠ పురములో’ చిత్రంతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు బన్నీ. వెంటనే కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్​తో ‘పుష్ప’ చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందాన్న నటిస్తోంది. ఇదిలా ఉండగా, స్టైలిష్ బన్నీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్తొకటి వచ్చింది. మమ్ముటి ప్రధాన పాత్రలో యదుగూరి రాజశేఖర్ రెడ్డి జీవిత్ర చరిత్రను ‘యాత్ర’ చిత్రంగా తెరకెక్కించిన మహి.వి.రాఘవ్ ఈసారి ఏపీ సీఎం జగన్ మోహన్​రెడ్డి బయోపిక్​ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. లీడ్ రోల్ చేయమని బన్నీని సంప్రదించాడట. దానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. సీఎం జగన్​ కాంగ్రెస్​ పార్టీ నుంచి తప్పుకుని ఏపీ సీఎం అయ్యే వరకు జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథనం ఉంటుందట. ఆ పాత్రకు బన్నీ అయితే కరెక్ట్​గా ఉంటాడని అర్జున్​ అప్రోచ్​ అయ్యాడట రాఘవ్. అయితే ఈ చిత్రానికి ‘నా పేరు జగన్’ అన్న టైటిల్ కూడా పెట్టనున్నారని టాక్. కానీ దీనికి సంబంధించిన అధికారిక వివరాలేవీ ఇంతవరకూ బయటకు రాలేదు. అందుకే ఈ వార్త నిజమా? కాదా? క్లారిటీ వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.