Breaking News

బత్తాయి పండ్లు కోసిన పరిటాల సునీత

బత్తాయి పండ్లు కోసిన పరిటాల సునీత

సారథి న్యూస్​, అనంతపురం: కరోనా విజృంభిస్తున్న వేళ.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు లాక్​ డౌన్​ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఎవరికివారు ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఎవరివారు తమ సొంత పనులను చక్కబెట్టుకుంటూ సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తున్నారు.

ఈ క్రమంలో సోమవారం టీడీపీ సీనియర్​ నాయకురాలు, మాజీమంత్రి పరిటాల సునీత చీనీ, బత్తాయి పండ్లను కోస్తూ తోటలో ఇలా కనిపించారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని నరసంపల్లి గ్రామ సమీపంలో పరిటాల కుటుంబానికి ఉన్న సొంత పొలంలో చీనీ, బత్తాయి తోట ఉంది. ఆమె మాస్క్​ కట్టుకుని ఈ తోటలోనే స్వయంగా ఆమె పండ్లు తెంచి ఇంటికి తీసుకెళ్లారు.