Breaking News

ఫలించిన పోరాటం

సారథిన్యూస్​, గోదావరిఖని: మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్న కేశోరాం సిమెంట్​ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్​ కార్మికుల పోరాటం ఫలించింది. వారికి పూర్తిస్థాయి వేతనాలు చెల్లించడంతోపాటు ఇతర డిమాండ్లు నెరవేర్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఉమ్మడి కరీంనగర్​ జిల్లా రామగుండం సమీపంలోని కేశోరాం కర్మాగారంలో పనిచేస్తున్న దాదాపు 1300 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొమ్మిది రోజులుగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. దిగివచ్చిన కేశోరాం ఫ్యాక్టరీ వారి డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించింది. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు. తమ ఆందోళనకు మద్దతు తెలిపిన ఐఎన్​టీయూసీ జాతీయ అధ్యక్షుడు నీలం సంజీవరెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఎంపీ వెంకటేశ్​ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులకు కాంగ్రెస్​ నాయకుడు, కార్మికసంఘం నేత ఎంఎస్​ రాజ్​ ఠాకూర్​ అభినందనలు తెలిపారు.