Breaking News

ప్రధాని మోడీ మరో రికార్డు

ప్రధాని మోదీ అరుదైన రికార్డు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన రికార్డును సాధించారు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన ఖ్యాతిని గడించారు. వాజపేయి కాంగ్రెసేతర ప్రధానిగా 2,268 రోజులు కొనసాగారు. కాగా, గురువారంతో ప్రధాని మోడీ ఆ రికార్డును అధిగమించారు. ఈ మేరకు బీజేపీ సోషల్​మీడియా జాతీయవిభాగం ఇంచార్జి ప్రీతీ గాంధీ ట్వీట్​ చేశారు. ఇక సుదీర్ఘకాలం పదవిలో ఉన్న వారిలో మోదీ నాలుగో స్థానానికి చేరారు. తొలి మూడు స్థానాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, డాక్టర్​ మన్మోహన్‌ సింగ్‌ ఉన్నారు. నెహ్రూ 16ఏళ్ల పాటు, ఇందిర 15ఏళ్ల పాటు, మన్మోహన్‌ పదేళ్ల పాటు ప్రధానులుగా పనిచేశారు.