సారథిన్యూస్, హైదరాబాద్: నయా గద్దర్, తెలంగాణకు చెందిన ప్రజాగాయకుడు సుద్దాల నిస్సార్ కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. నిరుపేదల ముస్లిం కుటుంబంలో జన్మించిన నిస్సార్.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపు తీసుకొచ్చాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతగా, ప్రజానాట్యమండలి కళాకారుడిగా నిస్సార్ వ్యవహరించారు. నిస్సార్ మృతికి రాష్ట్ర మంత్రి హరీశ్రావు, ఆర్టీసీ యూనియన్ నేత రాజిరెడ్డి, సీపీఐ నాయకుడు నారాయణ సంతాపం తెలిపారు.
- July 8, 2020
- Archive
- జాతీయం
- CARONA
- HYDERABAD
- NISSAR
- SINGER
- TELANGANA
- నిస్సార్
- ప్రజాగాయకుడు
- Comments Off on ప్రజాగాయకుడు నిస్సార్ మృతి