Breaking News

పొగరాయుళ్లూ.. జర భద్రం

పొగరాయుళ్లు జరభద్రం

ఢిల్లీ: పొగ తాగేవళ్లకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. సిగరేట్లు ద్వారా కరోనాకు వాహకాలుగా పనిచేస్తాయని పేర్కొన్నది. సిగరేట్​ అమ్మే వ్యక్తికి కరోనా ఉంటే.. అవి కొని తాగేవారికి వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వారు సిగరెట్​ను తమ చేతితో తాకుతారు అనంతరం పెదవులతో కూడా తాకుతారు. దీంతో కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిగరేట్లను విడిగా కొనేకంటే ప్యాకెట్​ను కొనుగోలు చేయడం మేలని సూచిస్తున్నారు. అంతే కాకుండా ధూమపానం చేసేవారి ఉపిరితిత్తులు కూడా సాధారణ వ్యక్తులకంటే బలహీనంగా ఉంటాయి. దీంతో ధూమపానం చేసేవారికి వ్యాధి సోకితే తొందరగా నయం కాకపోవచ్చని వైద్యనిపుణులు హెచ్చరించారు.