Breaking News

‘పుష్ప’ పాటల చిత్రీకరణ ప్రారంభం

స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​, ‌దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో మైత్రీ మూవిమేకర్స్​లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రం షూటింగ్​ను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం పరిమితమైన సిబ్బందితో​ పాటలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం ఓ షెడ్యూల్​ను పూర్తిచేసుకున్నది. లాక్​డౌన్​తో రెండో షెడ్యూల్​ ఆగిపోయింది. ఇప్పుడు అనుమతి రావడంతో రెండో షెడ్యూల్​ను ప్రారంభించారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్​గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్​ లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పటికే ట్యూన్స్‌ సిద్ధం చేసినట్టు సమాచారం.