Breaking News

పిట్టగూడు.. కట్టిచూడు!

పిట్టగూడు.. కట్టిచూడు!


సారథి, మహబూబ్ నగర్: రాష్ట్రంలో కరోన మహ్మమారి రోజు రోజుకు విజృంభిస్తుండటంతో ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే మాస్కు తప్పనిసరిగా మారింది. కొంతమంది ఎన్ 95 మాస్కులు ధరిస్తే మరికొందరు మాత్రం వాషబుల్ క్లాత్ మాస్కులను ధరిస్తున్నారు. మహబూబ్​ నగర్​ జిల్లా అడ్డాకుల మండలం చిన్న మునుగల్ చేడ్ గ్రామానికి చెందిన ఓ తాత గిజిగాడి పిట్టగూడును మాస్కుగా ధరించి పొలం వద్ద నుంచి నేరుగా పింఛన్​ తీసుకునేందుకు వచ్చాడు. దీంతో అక్కడున్న స్థానికులు పిట్టగూడును మాస్కుగా ధరించిన తాతతో సెల్ఫీలు దిగారు. పిట్టగూడు మాస్కులను ఫొటోలు తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.