![పిట్టగూడు.. కట్టిచూడు!](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/04/mbnr.jpeg?fit=300%2C200&ssl=1)
సారథి, మహబూబ్ నగర్: రాష్ట్రంలో కరోన మహ్మమారి రోజు రోజుకు విజృంభిస్తుండటంతో ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే మాస్కు తప్పనిసరిగా మారింది. కొంతమంది ఎన్ 95 మాస్కులు ధరిస్తే మరికొందరు మాత్రం వాషబుల్ క్లాత్ మాస్కులను ధరిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్న మునుగల్ చేడ్ గ్రామానికి చెందిన ఓ తాత గిజిగాడి పిట్టగూడును మాస్కుగా ధరించి పొలం వద్ద నుంచి నేరుగా పింఛన్ తీసుకునేందుకు వచ్చాడు. దీంతో అక్కడున్న స్థానికులు పిట్టగూడును మాస్కుగా ధరించిన తాతతో సెల్ఫీలు దిగారు. పిట్టగూడు మాస్కులను ఫొటోలు తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.