Breaking News

పిచ్‌ సైజు తగ్గించండి

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్​కు ప్రజాదరణ పెంచాలన్నా.. ఎక్కువ మంది ఇందులోకి రావాలన్నా ఆటలో కొన్ని మార్పులు చేయాలని టీమిండియా ప్లేయర్ జెమీమా రొడ్రిగ్స్ సూచించింది. ఇందులో భాగంగా పిచ్ సైజ్​ను కొద్దిగా తగ్గిస్తే ఫలితాలు మరోలా ఉంటాయని అభిప్రాయపడింది. ‘ఇప్పుడున్న దానికంటే పిచ్ సైజ్​ను కాస్త తగ్గించాలి. దీనివల్ల ఫలితాలు భిన్నంగా వస్తాయి. ఆటలో మజా కూడా పెరుగుతుంది. ఎక్కువ మంది ఆటను చూస్తారు. ఆడేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఓసారి ప్రయత్నించి చూడాలి’ అని ఐసీసీ వెబినార్​లో రొడ్రిగ్స్ పేర్కొంది. మరోవైపు ఇదే చర్చలో పాల్గొన్న న్యూజిలాండ్ కెప్టెన్ సోఫియా డివైన్ మరికొన్ని సూచనలు చేసింది. పురుషుల క్రికెట్​తో పోలిస్తే మహిళల మ్యాచ్​ల్లో వాడే బంతి చాలా చిన్నగా ఉంటుందని సోఫియా వెల్లడించింది. ఈ బంతి సైజ్​ను ఇంకాస్త చిన్నదిగా చేయాలని చెప్పింది.

‘యువ క్రికెటర్లను ఆకర్షించాలంటే పాత పద్ధతులకు స్వస్తి పలకాలి. పిచ్​కు బదులు బంతి సైజ్ తగ్గించాలి. దీనివల్ల పేసర్లు బంతిని మరింత వేగంగా వేస్తారు. స్పిన్నర్లు సులువుగా స్పిన్ రాబడతారు. దీనివల్ల ఆటలో వేగం పెరిగుతుంది. చూసేవాళ్లకు ఉత్సాహం వస్తుంది’ అని సోఫియా వ్యాఖ్యానించింది.