Breaking News

పరిశుభ్రతతో రోగాలు దూరం

సారథిన్యూస్, రామడుగు: వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని యూనిసెఫ్​ కో ఆర్డినేటర్​ కిషన్​స్వామి పేర్కొన్నారు. కరోన మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రజలంతా సహకరించాలని కోరారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామంలో శనివారం సర్పంచ్ సాదు పద్మ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక పారిశద్ధ్య కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సారిక. అంగన్వాడీ కార్యకర్తలు, రమ, లత సంధ్యారాణి, ఉమ, రాణి, మమత, నాయకులు మునీందర్ రెడ్డి, వెంకటేశ్​ తదితరులు పాల్గొన్నారు.