Breaking News

పద్మశాలి అసోసియేషన్ కమిటీ ఎన్నిక

తెలంగాణ పద్మశాలి అసోసియేషన్ కమిటీ ఎన్నిక

సారథి న్యూస్, ములుగు: తెలంగాణ పద్మశాలి అఫీషియల్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్(పొపా) నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ రాజ్ సమక్షంలో మంగళవారం ఎన్నుకున్నారు. ములుగు జిల్లా పొపా కమిటీ అధ్యక్షుడిగా ఏళ్ల మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా చుంచు రమేష్, కోశాధికారిగా ఆడపు రాజు, ఉపాధ్యక్షుడిగా మెరుగు రమేష్, రాంచందర్, సహాయ కార్యదర్శిగా తాళ్ల విద్యాసాగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా గజ్జెల సుమన్ ను ఎన్నకున్నారు. ములుగు జిల్లాలోని పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి కృషిచేస్తానని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షుడు డీపీ జనార్దన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రపు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి చిప్ప అశోక్​కు కృతజ్ఞతలు తెలిపారు.