Breaking News

పతంజలి మందుకు బ్రేక్

ఢిల్లీ: కరోనాకు ఆయుర్వేద మందును తీసుకొచ్చినట్లు ప్రకటించిన పతంజలి సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయుర్వేద ఔషధం ‘కరోనిల్‌’కు సంబంధించి చేస్తున్న ప్రచారాన్ని తక్షణం నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనిల్‌కు సంబంధించి నిర్వహించిన పరిశోధనల పూర్తి వివరాలు సమర్పించాలని సూచించింది. పతంజలి చెబుతున్న అంశాలపై వాస్తవాలు, శాస్త్రీయ అధ్యయన వివరాలు తమకు తెలియవని పేర్కొన్నది. పతంజలి సంస్థ మంగళవారం ఆయుర్వేద మందు కరోనిల్‌ను అట్టహాసంగా ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కరోనాకు ఆయుర్వేద మందును తీసుకొస్తున్నామని ప్రకటించిన పతంజలి సంస్థ అసలు కేంద్రం నుంచి అనుమతి కూడా తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఇక ఆ సంస్థ చేసిన పరిశోధనలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.