Breaking News

పండుగవేళ.. భద్రంగా ఉండండి

సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలకేంద్రంలో నాలుగు చోట్ల మాత్రమే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని మండల పరిషత్​ అధ్యక్షుడు జంగం శ్రీనివాస్​ సూచించారు. ఈ మేరకు తీర్మానం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆయాగ్రామాల్లో ప్రజలంతా కలిసి ఓకేచోట వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని పోలీస్​స్టేషన్లో వినాయకమంటపాల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పెద్దశంకరంపేటలోని శ్రీరామ్​ మందిర్​, ప్రభుమందిర్​, విట్టలేశ్వరమందిర్​, మార్కండేయ మందిర్​లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా తీర్మానం చేశారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌతికదూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై సత్యనారాయణ, టీఆర్​ఎస్​ మండల అధ్యక్షుడు మురళి పంతులు, ఎంపీటీసీ నౌలే సంతోష్​ తదితరులు పాల్గొన్నారు.