Breaking News

నెలరోజుల్లో నీళ్లిస్తే గుండు గీసుకుంటం

  • బీజేపీ నేత విజయ పాల్ రెడ్డి

సారథి న్యూస్​, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ నీళ్లు తీసుకొస్తే గుండు గీసుకుంటామని బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగిరెడ్డి విజయ పాల్ రెడ్డి సవాల్​ విసిరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టును పూర్తిచేయకుండా ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. ముందు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. సమావేశంలో అక్కన్నపేట బీజేపీ మండలాధ్యక్షుడు వీరాచారి, హుస్నాబాద్ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, శంకర్ బాబు, వేణుగోపాల్ రెడ్డి, సతీష్ పాల్గొన్నారు.