Breaking News

‘నిశ్శబ్దం’పై భారీ అంచనాలు

‘నిశ్శబ్దం’పై భారీ అంచనాలు

‘భాగమతి’ సినిమా తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ కావడంతో ‘నిశ్శబ్దం’పై భారీ అంచనాలే ఉన్నాయి. అదికాకుండా ఈ మూవీని థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేయాలనుకుంది టీమ్. అందుకు మరికొంత సమయం పట్టడం ఆడియాన్స్​లో క్యూరియాసిటీ తగ్గిపోతుందేమోనన్న ఆలోచనతో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అనుష్క, ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ హేమంత్ మధుకర్. తెలుగు తమిళ భాషలతో పాటు మలయాళ డబ్బింగ్ వర్షన్ ను స్ట్రీమింగ్ కు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘నిశ్శబ్దం’ ట్రైలర్ ను దగ్గుబాటి రానా రిలీజ్ చేశాడు.

ఒక పెయింటింగ్ కోసం అనుష్క, మాధవన్ ఓ హంటెడ్ హౌస్ కు వెళ్లడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది. ఇందులో అనుష్క ఓ పెయింటింగ్ కళాకారిణి అయిన మూగ యువతి సాక్షి పాత్రలో కనిపిస్తుంటే మాధవన్.. ఆంథోనీ అనే మ్యూజిషియన్ గా కనిపిస్తున్నాడు. అమెరికాలోని ఓ ఇంట్లో జరిగే సంఘటనల చుట్టూ సినిమా కథ నడిచినట్టుగా ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. అనుష్క బెస్ట్ ఫ్రెండ్ సోనాలి పాత్రలో షాలినిపాండే కనిపిస్తోంది. ఎంగేజ్​మెంట్​ అయిన రెండవ రోజు నుంచి సోనాలి కనిపించకుండా పోయిందని చెప్పడంతో ఆమె పాత్రకు కూడా బాగానే ప్రాధాన్యం ఉందనిపిస్తోంది. అంజలి, సుబ్బరాజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా కనిపించారు. సస్పెన్స్ అంశాలతో ట్రైలర్ ఉత్కంఠ భరితంగానే సాగుతూ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ నటులు మైఖేల్ మ్యాడ్సన్, శ్రీనివాస అవసరాల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించగా గిరీష్ గోపాలకృష్ణన్ బ్యాక్ గ్రౌండ్​ స్కోర్ అందించారు. షానైల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు.