Breaking News

నిరుపేద యువతికి సాయం

నిరుపేద యువతికి సాయం

సారథి న్యూస్, ములుగు: ఓ నిరుపేద యువతికి మహిళా అధికారి సాయం అందించారు. తిండిలేక అల్లాడిపోతున్న యువతి మంగళవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చింది. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన సబ్​రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్ ​రూ.మూడువేలు, 25కేజీల బియ్యం అందజేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన మురారి సుధాకర్, స్వరూప దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తల్లి నాలుగేళ్ల క్రితం చనిపోవడంతో వారి కుటుంబ పోషణ భారంగా మారింది. తండ్రి పిల్లలను పట్టించుకోకపోవడంతో కష్టాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సబ్​రిజిస్ట్రార్ ​తస్లీమా మహమ్మద్ వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఏ కష్టం వచ్చిన ఫోన్ చేయమని చెప్పి భరోసా ఇచ్చారు. ఆమె వెంట సర్వర్ ఫౌండేషన్ సభ్యులు మామిడి పెల్లి రమేష్, చంటి సామ్యూల్ ఉన్నారు.