Breaking News

నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ

సారథిన్యూస్,రామడుగు: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్​ నేతలు శుక్రవారం 100 మంది నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్​ యూత్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పంజల శ్రీనివాస్, గోపాల్​రావుపేట సర్పంచ్ సత్య ప్రసన్న, కాంగ్రెస్​ నాయకులు దేవకిషన్, శంకర్, బాలగౌడ్, పిండి శ్రీనివాస్ నాగరాజు, బాపురాజ్, మల్లికార్జున్, రాయుడు, మాణిక్యం, వెంకటేశ్​, ఉదయ్ పాల్గొన్నారు.