Breaking News

నిత్యావసర వస్తువులు పంపిణీ

సారథి న్యూస్​, రామడుగు: కరోనా లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఓ స్వచ్చందసంస్థ ఆదుకుంది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని జెబెల్​ అలీ ప్రాంతంలోని లేబర్​ క్యాంపు​లో తలదాచుకుంటున్న పేదలకు ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాసమితి ఉపాధ్యక్షుడు బాలు బొమ్మిడి, మీడియా కోఆర్డినేటర్​ చిలుముల రమేశ్​, ముఖ్య సలహాదారులు మోహన్ రెడ్డి, అశోక్ జంగం, సోషల్ మీడియా కోర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్, మాల్యాల, జెబెల్ అలీ పాల్గొన్నారు.