Breaking News

నారాయణకు ఘన నివాళి

నారాయణకు ఘన నివాళి

సారథి న్యూస్​, రామగుండం: సీపీఐ నేత ఎం.నారాయణ.. నిజాయితీకి మారుపేరు అని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి కొనియాడారు. గురువారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని భాస్కర్​రావుభవన్​లో ఎం.నారాయణ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు వారు హాజరై ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్​, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళవేన శంకర్, యూనియన్ అధ్యక్షులు వై గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, నాయకులు వైవీ రావు, మఎల్లా గౌడ్ కనక రాజు, గోశిక మోహన్, రాజారత్నం, సునీల్ కుమార్, దినేష్, ప్రీతం, ప్రమీల దేవి, ఓదమ్మ, లక్ష్మీనారాయణ, రమేశ్​, మదన కుమారస్వామి, రాజమౌళి, అంజయ్య, రాజయ్య , స్వామి, రమ పాల్గొన్నారు.