Breaking News

నాయిని సతీమణి అహల్య కన్నుమూత

నాయిని సతీమణి అహల్య కన్నుమూత

సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, టీఆర్‌ఎస్‌ దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య(680 కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. నాయిని నర్సింహారెడ్డి ఈనెల 22న కన్నుమూసిన విషయం తెలిసిందే. ‌ఇటీవల నాయిని, ఆయన భార్య అహల్య కరోనా బారినపడ్డారు. దీంతో ఇద్దరు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. భర్త నాయిని నర్సింహారెడ్డి మృతితో చివరి చూపునకు అహల్యను కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో ఇంటికి తీసుకొచ్చారు. కరోనా నెగటివ్ వచ్చినా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి మరింత విషమించడంతో మృతిచెందారు.