![నాగర్ కర్నూల్ కలెక్టర్ గా యాస్మిన్ బాషా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/ngkl-2-f-1.jpg?fit=674%2C510&ssl=1)
సారథి న్యూస్, నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ను బదిలీచేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఆయన స్థానంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఎస్ కే యాస్మిన్బాషాకు నాగర్ కర్నూల్ అదనపు బాధ్యతలు అప్పగించారు. సోమవారం ఉదయం చార్జ్ ను అప్పగించి కలెక్టర్ బాధ్యతల నుంచి ఈ.శ్రీధర్ రిలీవ్ అయ్యారు. నాగర్ కర్నూల్జిల్లాలో ప్రజారోగ్యం, హరితహారం, శ్మశాన వాటికల నిర్మాణాలు, డంపింగ్ యార్డులు, పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ అప్డేషన్తదితర అంశాలపై దృష్టి సారించనున్నట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. త్వరలోనే జిల్లా అధికారులతో జిల్లా ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.