Breaking News

‘నవోదయ’ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

‘నవోదయ’ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

సారథి న్యూస్, బిజినేపల్లి: నవోదయ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని అఖిల భారత నవోదయ విద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నాగర్​కర్నూల్ ​ఎంపీ పి.రాములును బుధవారం కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరాచారి మాట్లాడుతూ.. 2004 జనవరికి ముందు విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్​సౌకర్యం కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తీసుకురావాలని కోరారు. సుదీర్ఘకాలంగా జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది విద్యార్థులను ఉత్తమ, ఉన్నత స్థాయిలో చేరేలా కృషి చేస్తున్న నవోదయ ఉద్యోగుల పరిస్థితి పదవీ విరమణ అనంతరం చాలా దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన అన్ని విభాగాల్లో ఉద్యోగులకు పాత పెన్షన్ సౌకర్యం ఉన్నప్పటికీ తమకు మాత్రం లేదన్నారు. జాతీయ స్థాయిలో ఎంపీలను కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ.. నవోదయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ పరిష్కారానికి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల భాస్కరాచారి, ప్రిన్సిపల్ వీరరాఘవయ్య, వట్టెం నవోదయ యూనిట్ నాయకులు వెంకటరెడ్డి, మంజుల, శేషు, మ​న్మోహన్, ఉదయ ప్రవీణ, విజయలక్ష్మి, మునీంద్రా,రామకృష్ణ, సుప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

నాగర్​కర్నూల్ ఎంపీ రాములుతో నవోదయ ఉపాధ్యాయ, ఉద్యోగులు