![పృథ్విరాజ్కు కరోనా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/PRITHVIRAJFFF.jpg?fit=700%2C467&ssl=1)
సారథిన్యూస్, హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, వైసీపీ నేత పృథ్విరాజ్కు కరోనా అంటుకుంది. పదిరోజుల నుంచి ఆయన తీవ్రజ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. దీంతో వైద్యుల సూచనమేరకు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వైద్యుల సూచన మేరకు తాను 15 రోజులు క్వారంటైన్లో ఉంటానని చెప్పారు.