Breaking News

నటుడు పృథ్విరాజ్​కు కరోనా

పృథ్విరాజ్​కు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: ప్రముఖ హాస్యనటుడు, వైసీపీ నేత పృథ్విరాజ్​కు కరోనా అంటుకుంది. పదిరోజుల నుంచి ఆయన తీవ్రజ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. దీంతో వైద్యుల సూచనమేరకు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్​ వచ్చినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వైద్యుల సూచన మేరకు తాను 15 రోజులు క్వారంటైన్​లో ఉంటానని చెప్పారు.