Breaking News

నకిలీ సీడ్స్ అమ్మితే కేసులు

సారథి న్యూస్, మెదక్: జిల్లాలో ఎక్కడైన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే సంబంధిత వ్యాపారులపై క్రిమినల్​ కేసులు నమోదుచేస్తామని మెదక్ కలెక్టర్​ ఎం.ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో మాట్లాడుతూ రైతులు వ్యయప్రయాసాలకోర్చి పంటలు పండించే అన్నదాతలకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే కొందరు బ్లాక్‌లో విత్తనాలు అమ్ముతున్నారని వారిపై సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారని వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని వ్యవసాయాధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వివరించారు. మెదక్​ జిల్లా అడిషనల్​ కలెక్టర్​ నగేష్​, మెదక్​​, తూప్రాన్​ డీఎస్​పీలు కృష్ణమూర్తి, కిరణ్​కుమార్​, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురామ్​, వ్యవసాయశాఖ అధికారులు, సీడ్​ డీలర్లు పాల్గొన్నారు.