Breaking News

నకిలీ విత్తన రాకెట్​ గుట్టు రట్టు

సారథిన్యూస్​, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. సుమారు రూ. 30 లక్షలు విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, వాటిని ప్యాకింగ్​ చేసే మిషనరీని, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం కమ్మగూడెంలో నకిలీ విత్తనాలు ఉన్నట్టు పోలీసులకు సమాచారమందింది. కూపీ లాగగా.. ఏపీ, తెలంగాణకు చెందిన ఓ ముఠా ఈ నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు జోగుళాంబ గద్వాల, నాగర్​కర్నూల్​, నల్లగొండ, ఏపీలోని నంద్యాలకు 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరు అక్షర, ఇండిగో కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. ఇంకా కొందరు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్పీ రంగనాథ్​ తెలిపారు.