Breaking News

ధోనీ అరుదైన రికార్డు

ధోనీ అరుదైన రికార్డు

టీ20 క్రికెట్‌ లీగ్‌లో చెన్నై సారథి ఎంఎస్‌ ధోనీ అరుదైన రికార్డు సృష్టించాడు. లీగ్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. సోమవారం రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో ఈ ఘనత సాధించాడు. చెన్నైకి 170 మ్యాచ్‌లు ప్రాతినిథ్యం వహించిన అతడు పుణె తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు. ఫిక్సింగ్‌ ఆరోపణల కారణంగా చెన్నై జట్టును రెండేళ్లు నిషేధించడంతో 2016, 2017 సీజన్‌లో ధోనీ పుణె తరఫున ఆడిన సంగతి తెలిసిందే. సారథిగా చెన్నై జట్టుకు అతడు మూడు టైటిళ్లు సాధించి రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ప్రతి సీజన్‌లోనూ జట్టును ప్లేఆఫ్‌కు చేర్చాడు.