Breaking News

ధైర్యంగా ఉండాలె

సారథి న్యూస్​, రామగుండం: కరోనా బాధితులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. తగిన వైద్యం తీసుకుంటే ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చని చెప్పారు. దేశంలో కరోనా బారినపడి ఎంతో మంది 85 శాతంపైనే కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. గురువారం సీపీ ఆదేశాల మేరకు డీసీపీ అశోక్​కుమార్ నేతృత్వంలో ​ కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయి చికిత్సపొందుతున్న పోలీసులకు రోగనిరోధకశక్తిని పెంచే పండ్లు, డ్రైఫ్రూట్స్​, టాబ్లెట్స్​ అందజేశారు. కరోనా బారినపడ్డ ప్రతి పోలీసు​కు కిట్​లను అందజేశారు. కార్యక్రమంలో ఏసీపీ ఏఆర్ సుందర్ రావు, కోవిడ్ సెల్ ఇంచార్జి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీశ్​, ఆర్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.