Breaking News

దోమ తెరలు పంపిణీ

దోమ తెరలు పంపిణీ

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీ, మండపాక గ్రామాల్లో వాజేడు వైద్యబృందం ఆధ్వర్యంలో దోమ తెరలను పంపిణీ చేశారు. అనంతరం ‘ఫ్రై డే.. డ్రై డే’ కార్యక్రమాన్ని నిర్వహించి నిల్వ ఉన్న నీటిని పారబోశారు. మెడికల్​ ఆఫీసర్​ మంకిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మాస్కులు కట్టుకుని, భౌతికదూరం పాటించాలని, జలుబు, దగ్గు, జ్వరం ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ శరత్ బాబు, హెల్త్ సూపర్​వైజర్​కోటిరెడ్డి, ఏఎన్ఎం రాజేశ్వరి, చిన్న వెంకటేశ్వర్లు, ఆశా వర్కర్​ సమ్మక్క, నాగలక్ష్మి పాల్గొన్నారు.