![దళితుల పై దాడులు ఆపాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/cpd-2-4.jpg?fit=677%2C364&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: దేశంలో రోజు రోజుకు దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ వెన్న రాజమల్లయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక తహసీల్దార్ ద్వారా జిల్లా కలెక్టర్ కు పంపిన వినతిపత్రంలో డిమాండ్ చేశారు. దళితులకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రుణాలను మంజూరు చేయాలని కోరారు.